ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – అల్లాహ్ గ్రంథము (ఖుర్’ఆన్) నుండి ఒక్క అక్షరమైనా పఠించిన ప్రతి ముస్లిం ఒక (సత్కార్యాన్ని చేసిన) పుణ్యాన్ని పొందుతాడు, అంతేగాక అతనికి లభించిన ఆ ప్రతిఫలం పదింతలుగా ఎక్కువ చేయబడుతుంది – అని తెలియజేస్తున్నారు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దీనిని ఇలా వివరించినారు (“అలిఫ్, లామ్, మీమ్” లను నేను ఒక అక్షరం అనడం లేదు. (అందులో) “అలిఫ్” ఒక అక్షరం, “లామ్” ఒక అక్షరం మరియు “మీమ్” ఒక అక్షరం.”) “అంటే ఇవి మూడు అక్షరాలు, వీటిలో ముప్ఫై పుణ్యాలున్నాయి”.