ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సత్యం పలకమని ఆజ్ఞాపించారు మరియు దానికి కట్టుబడి ఉండటం నిరంతర సత్కార్యాలకు దారి తీస్తుంది అని తెలియజేసారు. నిలకడగా మంచిపనులు చేయడం అనేది చేసే వ్యక్తిని స్వర్గానికి చేరుస్తుంది మరియు అతను రహస్యంగానూ మరియు బహిరంగంగానూ సత్యాన్ని అవలంబిస్తూనే ఉంటాడు. అటువంటి వ్యక్తి అత్యంత సత్యవంతునిగా ముద్ర వేయబడటానికి అర్హుడు అవుతాడు. ఇది సత్యసంధత యొక్క పరాకాష్ఠ. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అసత్యం పలుకుట పట్ల మరియు తప్పుడు మాటలు మాట్లాడుట పట్ల హెచ్చరించారు. ఎందుకంటే అది ధర్మం నుండి వైదొలగడానికి మరియు చెడు, అవినీతి మరియు పాపపు పనులకు పాల్బడడానికి దారి తీస్తుంది; చివరికి నరకాగ్నికి దారి తీస్తుంది. అతడు నిరంతరం అసత్యమునే పలుకుతూ ఉంటాడు, చివరికి అతడు అల్లాహ్ వద్ద అబద్ధాలకోరులలో ఒకనిగా నమోదు చేయబడతాడు.