ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు – ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అప్పుడే వుజూ ముగించి వచ్చిన ఒక వ్యక్తి ని చూసారు. అతడు తన పాదం పై ఒక గోరు అంత పరిమాణం గల భాగాన్ని కడగకుండా వదిలేసాడు. ఆ భాగానికి వుజూ నీరు చేరలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అతని నిర్లక్ష్యం కారణంగా (నీరు చేరకుండా) ఉండిపోయిన భాగం వైపునకు చూపుతూ అతనితో ఇలా అన్నారు: “వెళ్ళు, వెళ్ళి నీ ఉదూను ఉత్తమంగా ఆచరించి పూర్తి చేయి, ప్రతి భాగానికి దానికి చేరవలసిన నీరు చేరేలా చేయి.” కనుక అతడు తిరిగి వెళ్ళి, (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్టుగా) వుజూ పూర్తి చేసి, అప్పుడు నమాజు ఆచరించాడు.