అబూ అబ్స్ అబ్దుర్రహ్మాన్ ఇబ్న్ జబ్ర్ (రదియల్లాహు అన్హు) రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఇలా ఉల్లేఖిస్తున్నారు: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “అల్లాహ్ మార్గములో (శ్రమించుటలో) ఎవరి పాదములు దుమ్ము, ధూళితో కప్పబడబడతాయో, వాటిని నరకాగ్ని తాకదు.”
ప్రామాణికమైన హదీథు - అల్ బుఖారీ నమోదు చేసినారు:
ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శుభవార్తను వినిపిస్తున్నారు – అల్లాహ్ మార్గములో శ్రమిస్తున్న కారణంగా ఎవరి పాదములైతే దుమ్ము, ధూళితో ఆవరించబడతాయో, అటువంటి వ్యక్తిని నరకాగ్ని తాకదు అని.
fawaed
ఎవరైతే అల్లాహ్ మార్గములో శ్రమిస్తారో అటువంటి వారి కొరకు, "నరకము నుండి రక్షించబడతారు" అనే శుభవార్త ఇది.
ఆ రోజులలో ప్రజలు ఎక్కువగా కాలినడకనే ప్రయాణించేవారు, ఆ కారణంగా అల్లాహ్ మార్గములో వారి శరీరం అంతా దుమ్ము, ధూళి పేరుకు పోతూ ఉండేది, అలాగే వారి కాళ్ళు, పాదాలు కూడా దుమ్ము ధూళితో ఆవరించబడి పోయేవి.
ఇమాం హాఫిజ్ ఇబ్న్ హజర్ అల్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “కేవలం పాదాలకు దుమ్ము, ధూళి తగలడం నరకాగ్నిని అతనిపై నిషేధిస్తుంది అంటే, మరి అల్లాహ్ మార్గములో తన శక్తి, సామర్థ్యాలు పూర్తిగా ఆవిరి అయిపోయేలా శ్రమించే వానికి ఏమి లభిస్తుందో ఆలోచించండి.”