ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: "ఏదైనా ఒక సమాధి ప్రక్క నుండి వెళుతున్న వ్యక్తి, ఆ సమాధిని చూస్తూ అతడి స్థానములో తానుంటే ఎంత బాగుండును అని అనుకునేటంత వరకూ అంతిమ ఘడియ స్థాపించబడదు". ఆ వ్యక్తి అలా ఎందుకు అనుకుంటాడూ అంటే ప్రపంచములో అసత్యము మరియు దాని జనులు బాగా ప్రబలిపోవడం, ప్రలోభాలూ, దురాకర్షణలూ, పాపాలు మరియు దుర్మార్గమూ, అరాచకత్వమూ బాగా ప్రబలిపోయి, తన(లో) ధర్మము ఎక్కడ బలహీనపడిపోతుందో అనే భయంతో అతడు అలా అనుకుంటాడు.