ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఇలా తెలియజేస్తున్నారు. ప్రతి విశ్వాసి తీర్పు దినమున ఏకంగా అల్లాహ్ ఎదురుగా నిలబడతాడు, మరియు అల్లాహ్ అతనితో మధ్యవర్తి లేకుండా మాట్లాడతాడు మరియు పదాలను అనువదించడానికి వారి మధ్య అనువాదకుడు కూడా ఉండడు. కనుక అతడు తీవ్రమైన భయంతో తన ముందు ఉన్న నరకాగ్ని నుండి రక్షణ పొందటానికి మార్గము ఏమైనా దొరుకుతుందేమో అనే ఆశతో కుడి వైపునకు మరియు ఎడమ వైపునకు చూస్తాడు. అతడు తన కుడివైపుకు చూసినపుడు, అతనికి తాను చేసిన మంచి పనులు తప్ప మరేమీ కనిపించవు. అతడు తన ఎడమవైపుకు చూసినపుడు, అతనికి తాను చేసిన చెడు పనులు తప్ప మరేమీ కనిపించవు. తన ఎదురుగా చూసినపుడు, అతనికి నరకాగ్ని తప్ప మరేమీ కనిపించదు, అతడు దాని నుండి తప్పించుకోలేడు ఎందుకంటే అతడు దానిపై ఉన్న ఒక వంతెనను (పుల్ సిరాత్ ను) దాటవలసి ఉంటుంది. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: మీకు మరియు నరకాగ్నికి మధ్య దాతృత్వం మరియు సత్కార్యాల కవచాన్ని ఉంచండి, అది సగం ఖర్జూరం అంత చిన్నది అయినా సరే.