ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేస్తున్నారు – తీర్పు దినము నాడు తన మధ్యవర్తిత్వాన్ని పొందే వారు ఎవరంటే, ఎవరైతే ‘నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, కేవలం అల్లాహ్ తప్ప’ అని చిత్తశుద్ధితో హృదయపూర్వకంగా పలుకుతాడో’. అంటే, ‘కేవలం అల్లాహ్ తప్ప, నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు’ అని పలుకబడే సాక్ష్యం స్వచ్ఛమైనదై ఉండాలి, షిర్క్ (అల్లాహ్ కు ఇతరులను సాటి కల్పించడం) మరియు కపటత్వముల నుండి విముక్తి అయినదై ఉండాలి.