ఉమ్ముల్ ము’మినీన్ (విశ్వసుల మాతృమూర్తి అయిన) ఆయిషా రదియల్లాహు అన్హా, అల్ హౌలాఅ బింత్ తువైత్ రదియల్లాహు అన్హాతో ఉన్నపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాగానే ఆమె అక్కడి నుండి లేచి వెళ్ళిపోయినది. ఆయిషా రదియల్లాహు అన్హా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా అన్నారు: “ఈ స్త్రీ రాత్రి నిద్రపోదు, రాత్రంతా ఇబాదత్’లో గడిపేస్తుంది”. అపుడు ఆమె తనపై తాను చాలా కఠినంగా ఉండటాన్ని ఖండిస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఆమె రాత్రిపూట నిద్రపోదా! మీరు క్రమం తప్పకుండా చేయగలిగినంత వరకు మాత్రమే సత్కార్యాలలో (ఇబాదాత్’లలో) పాల్గొనండి. అల్లాహ్ సాక్షిగా! అల్లాహ్ తన సద్గుణవంతులైన, విధేయులైన దాసులకు వారి విధేయత, మంచి పనులు మరియు సద్గుణ చర్యలకు ప్రతిఫలం ఇవ్వడంలో అలసిపోడు, వారు అలసిపోయి వాటిని చేయడం మానేసే వరకు.