అమీరుల్ ముమినీన్ ఉథ్మాన్ బిన్ అఫ్ఫాన్ రదియల్లాహు అన్హు ఒకవేళ సమాధి దగ్గర ఆగినట్లయితే, ఆయన ఎంతో ఏడ్చేవారు. కన్నీళ్లు అంత ఎక్కువగా కారడం వలన ఆయన గడ్డ కూడా తడిసిపోయేది. దానికి అక్కడి వారిలో కొందరు ఆయనను ఇలా అడిగారు: "మీరు స్వర్గం గురించి లేదా నరకం గురించి విన్నప్పుడు, (స్వర్గశుభాల సంతోషంతో) ఆనంద భాష్పాలు రాల్చడమో, లేదా నరక భయంతో ఏడవడమో చేయరు! కానీ సమాధిని చూసి మాత్రం ఏడుస్తున్నారు?" అవుడు ఉథ్మాన్ రదియల్లాహు అన్హు సమాధి గురించి ఇలా చెప్పినారు: "ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: 'సమాధి పరలోక ప్రయాణంలో మొదటి మెట్టు. ఇక్కడ (అల్లాహ్ శిక్ష నుండి) రక్షించబడితే, తర్వాతి దశలు సులభంగా ఉంటాయి. ఇక్కడ రక్షించబడకపోతే, తర్వాతి దశల్లో వచ్చే శిక్షలు మరింత కఠినంగా ఉంటాయి.'"