ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సమూద్ ప్రజల నివాసాల గుండా వెళుతున్నప్పుడు, శిక్షించబడిన మరియు తమకు తామే అన్యాయం చేసుకున్న వారి ఇళ్లలోకి ఎవరూ ప్రవేశించకూడదని ఆయన నిషేధించారు, ఏడుస్తూ మరియు వారికి పట్టిన దుస్థితిని గురించి ఆలోచిస్తూ, వారికి సంభవించిన ఆపద తనకు కూడా వస్తుందేమోనని భయపడుతూ ఉన్న స్థితిలో తప్ప. తరువాత, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన గుర్రాన్ని త్వరగా వెళ్ళమని ఆజ్ఞాపించి, ఆ ప్రాంతాన్ని వదిలి త్వరత్వరగా వెళ్ళిపోయినారు.