ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన చివరి శ్వాసల్లో తన సమాజానికి మాటి మాటికీ ఇచ్చిన ఉపదేశం: "నమాజును (సలాత్) పాటించండి, దాన్ని నిర్లక్ష్యం చేయకండి, ఎప్పుడూ జాగ్రత్తగా ఉండండి. అలాగే, మీ ఆధీనంలో ఉన్న సేవకులకు, బానిసులకు వారి హక్కులను ఇవ్వండి, వారిని దయగా చూడండి." ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మరణదశలో ఈ మాటలను పదే పదే పునరావృతం చేస్తూ, చివరికి ఆయన గొంతులో ఈ మాటలు మాత్రమే మోగుతూ ఉండినాయి, నాలుక స్పష్టంగా పలకలేని స్థితిలో కూడా ఈ ఉపదేశాన్ని విడిచిపెట్టలేదు.