ముస్లిం సమాజానికి మాతృమూర్తి అయిన ఉమ్ముల్ మోమినీన్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ఇలా పలికినారు: 'ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, రమదాన్ చివరి పది రోజుల్లో ఇతికాఫ్ (మసీదులో ఏకాంతంగా ప్రత్యేక ధ్యాన నివాసం) పాటించేవారు. ఇది లైలతుల్ ఖద్ర్ (విధివ్రాత నిర్ణయం జరిగే అత్యంత గొప్ప రాత్రి) కోసం అన్వేషణగా ఉండేది. ఆయన ఈ సున్నతును మరణం వరకు కొనసాగించారు. ఆయన తర్వాత ఆయన భార్యలు (రదియల్లాహు అన్హున్నా) కూడా ఇతికాఫ్ ను కొనసాగించినారు'.