ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: నిర్దిష్ట వారసులకు వారి వారసత్వ భాగం (ఫరైద్) ముందుగా కేటాయించండి. (వారసత్వ పంపకాల తరువాత) మిగిలిన సంపత్తి అత్యంత సమీప పురుష వారసునికి (అసబా) చెందుతుంది. ప్రామాణికమైన హదీథు - అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
explain-icon

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారసత్వ ఆస్తిని పంచేవారికి, సర్వోన్నతుడైన అల్లాహ్ కోరిన విధంగా, న్యాయమైన మరియు ధార్మికమైన పద్ధతిలో, దానికి అర్హులైన వారికి పంచాలని ఆజ్ఞాపిస్తున్నారు. అందువలన, నిర్ణీత వాటాలు (ఫురూద్) కలిగిన వారికి అల్లాహ్ గ్రంథంలో నిర్దేశించిన వారి వాటాలు ఇవ్వబడతాయి. అవి: రెండు-మూడు వంతులు (2\3), మూడవ వంతు (1\3), ఆరవ వంతు (1\6), సగం (1\2), నాలుగవ వంతు (1\4), మరియు ఎనిమిదవ వంతు (1\8). ఆ తర్వాత ఏది మిగిలి ఉన్నా, అది మరణించిన వ్యక్తికి అత్యంత దగ్గర సంబంధం కలిగి ఉన్న పురుషులకు ఇవ్వబడుతుంది, మరియు వారిని 'అస్బా' (Residuaries) అని అంటారు.

explain-icon

fawaed

  • ఈ హదీథ్ ప్రవచనము వారసత్వ ఆస్తి పంపిణీలో ఒక ప్రాథమిక నియమంగా ఉంది.
  • వారసత్వ విభజనలో మొదట ఫరాయిద్ హక్కుదారులతో (నిర్ణీత వాటాలు కలిగిన వారితో) ప్రారంభించాలి.
  • ఫరాయిద్ వాటాలను ఇచ్చిన తరువాత మిగిలినది అస్బా (వారసత్వంలో మిగిలిన భాగాన్ని అందుకునే హక్కు కలిగి ఉన్న పురుష బంధువులకు) చెందుతుంది.
  • దగ్గర బంధువులకు ప్రాధాన్యత ఇవ్వాలి, అందుకే తండ్రి వంటి సమీప బంధుత్వపు 'అస్బా' (మిగిలిన ఆస్తిని తీసుకునే బంధువు) ఉన్నప్పుడు, బాబాయి వంటి దూరపు బంధుత్వపు 'అస్బా' వారసత్వ ఆస్తి పొందడు.
  • నిర్ణీత వారసత్వ వాటాలలో (ఫురూద్) ఆస్తి మొత్తం అయిపోతే, ('అంటే ఆస్తిలో ఏమీ మిగలకపోతే), అస్బాకు (మిగిలిన భాగాన్ని తీసుకునేవారికి) ఏమీ దక్కదు.
explain-icon

కూర్పులు

explain-icon

ఇంకా