ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేస్తున్నారు: ఎవరైతే ఉదూ యొక్క మూల స్తంభాలను (అర్కాన్ అల్ ఉదూ) పూర్తిగా ఆచరిస్తూ, దాని యొక్క సున్నత్ ఆచరణలను (సునన్ అల్ ఉదూ) మరియు విధివిధానాలను పూర్తిగా పాటిస్తూ, సంపూర్ణంగా ఉదూ చేసి శుక్రవారం నమాజునకు హాజరవుతాడో, మరియు ఇమాం యొక్క ‘ఖుత్బాహ్’ను శ్రద్ధగా వింటాడో, మరియు (మస్జిదులో) పనికిరాని వ్యర్థ సంభాషణ నుండి దూరంగా ఉంటాడో – అల్లాహ్ అతని పది రోజుల చిన్నచిన్న పాపాలను క్షమిస్తాడు; శుక్రవారం నమాజు నుండి మరో శుక్రవారం వరకు, మరియు అదనంగా మూడు రోజులు; ఎందుకంటే ఒక మంచి పనికి పది రెట్ల ప్రతిఫలం ప్రసాదించబడుతుంది గనుక. తరువాత ఇమాం ‘ఖుత్బాహ్’లో (ప్రసంగం లో) చెప్పే విషయాల పట్ల హృదయాన్ని లగ్నం చేయకుండా ఉండడాన్ని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారు; అలాగే ప్రసంగం జరుగుతూ ఉండగా మస్జిదులో నేలపై గులకరాళ్ళను తాకడం, వాటిని ఏరడం మొదలైన వృధా కాలక్షేపం వంటి పనులకు పాల్బడడం పట్ల కూడా హెచ్చరించినారు. ఎందుకంటే ఎవరైతే అలా చేస్తారో (ఖుత్బాహ్ జరుగుతుండగా) వారు వ్యర్థమైన విషయాలలో పడిపోయిన వారుగా పరిగణించబడతారు, ఎవరైతే వ్యర్థమైన విషయాలలో పడిపోతారో వారికి శుక్రవారం యొక్క సంపూర్ణ పుణ్యఫలం లభించదు.