ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేస్తున్నారు: స్వర్గంలో వారికి (విశ్వాసులకు) ఒక బజారు ఉంది, అక్కడ వారు కలుసుకుంటారు, అక్కడ కొనుగోలు లేదా అమ్మకం ఉండదు, మరియు వారు తాము కోరుకున్నదానిని తీసుకుంటారు. వారందరూ ప్రతి ఏడు రోజులకోసారి అక్కడకు వస్తారు. ఉత్తరం వైపునుండి గాలి వీస్తూ వారి ముఖాలను, దుస్తులను కదిలిస్తుంది. వారి సౌందర్యం, అందం పెరుగుతాయి. వారు తమ అందం మరియు సౌందర్యం పెరిగిన స్థితిలో తమ కుటుంబాలకు తిరిగి వస్తారు, వారి కుటుంబాలు వారితో ఇలా అంటాయి: అల్లాహ్ సాక్షి, మేము వెళ్ళిన తర్వాత మీ అందం మరియు సౌందర్యం మరింత పెరిగింది. వారు (మరలా) ఇలా అంటారు: అల్లాహ్ సాక్షి, మేము వెళ్ళిన తర్వాత మీ అందం మరియు సౌందర్యం మరింత పెరిగింది.