స’ఆద్ బిన్ అబీ వఖ్ఖాస్ (రదియల్లాహు అన్హు) తన ధైర్యము, సాహసము, శౌర్యపరాక్రమాలు మొదలైన వాటి కారణంగా తాను బలహీనులకంటే గొప్పవాడిని అనే భావనలో పడిపోయినారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు: “మీలోని బలహీనులు, నిజాయితీతో కూడిన వారి ప్రార్థనలు, వేడుకోళ్ళు, దుఆలు మొదలైవ వాటి ద్వారా తప్ప నీవు విజయన్ని, జీవనోపాధిని పొందినావా?” వారు తరచుగా తమ ప్రార్థనలలో, దుఆలలో, వేడుకోళ్ళలో నిజాయితీగా ఉంటారు, ఎందుకంటే వారి హృదయాలు ఈ ప్రాపంచిక జీవితపు అలంకారాల పట్ల, ఆడంబరాల పట్ల అనుబంధాన్ని కలిగి ఉండవు.