ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ప్రారంభంలో ఇస్లాం ధర్మాన్ని కొద్దిమంది మాత్రమే అనుసరించేవారు, ఆ తొలికాలంలో ఇస్లాం ధర్మం అనేది పరాయిగా (అపరిచితమైనదిగా) ఉండేది. భవిష్యత్తులో కూడా, దాన్ని నిజంగా పాటించేవారు చాలా తక్కువ అయిపోతారు, అంటే ఇస్లాం మళ్లీ ఆ పరాయితన అపరిచిత స్థితికి చేరుకుంటుంది. అందుకే, అలాంటి పరాయితన స్థితిలో కూడా దానిని అనుసరిస్తూ, ఇస్లాంను గట్టిగా పట్టుకున్నవారికి శుభం, అభినందన, ఆనందం, హర్షం కలుగుగాక!"