ఈ హదీథులో రయ్యన్ ద్వారం అని పిలువబడే ఒక స్వర్గ ద్వారం ఉందని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మనకు తెలియజేస్తున్నారు; పునరుత్థాన దినమున ఉపవాసం పాటించేవారు దాని ద్వారా ప్రవేశిస్తారు, వారు తప్ప మరెవరూ ప్రవేశించరు. ఆ దినమున "ఉపవాసం పాటించేవారు ఎక్కడ?" అని పిలుపు వస్తుంది, వారు నిలబడి ఆ ద్వారం గుండా స్వర్గములోనికి ప్రవేశిస్తారు, మరెవరూ ప్రవేశించరు. వారిలో చివరి వ్యక్తి కూడా ప్రవేశించిన తర్వాత, అది మూసివేయబడుతుంది. ఇక మరెవరూ ప్రవేశించరు.