ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేసినది ఏమిటంటే, ఎవరైతే ఇస్లాం ధర్మం యొక్క బహిరంగ ఆచారాలకు కట్టుబడి, మనలా నమాజు చేస్తాడో, మన ఖిబ్లా అయిన కఅబహ్ వైపునకు అభిముఖుడవుతాడో మరియు మనం జిబహ్ చేసిన దానిని ధర్మసమ్మతమైనదిగా భావించి తింటాడో, అతడే ముస్లిం. అతనికి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త యొక్క రక్షణ మరియు వాగ్దానం ఉంది. కాబట్టి అతని విషయంలో అల్లాహ్ యొక్క రక్షణ మరియు వాగ్దానాన్ని ఉల్లంఘించకండి.