ఎవరైతే తన ముస్లిం సోదరుడికి అతడి గౌరవం, డబ్బు లేదా రక్తం విషయంలో అన్యాయం చేస్తారో, అలాంటి ప్రతి ఒక్కరూ, పునరుత్థాన దినం రాకముందే, తాను అన్యాయం చేసిన వ్యక్తిని క్షమించమని అడగాలి అని ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారు. ఆ రోజు ఒక దీనార్ బంగారం లేదా ఒక దిర్హం వెండి తనకు తానుగా విమోచన క్రయధనంగా అంటే పరిహారంగా చెల్లించాలి అనుకున్నా ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఆ రోజు శిక్ష మంచి పనులు మరియు చెడు పనుల రూపంలో ఉంటుంది. అన్యాయానికి గురైన వ్యక్తి, తనకు జరిగిన అన్యాయానికి తగినట్టుగా, అన్యాయం చేసిన వ్యక్తి యొక్క సత్కార్యాల నుండి సత్కార్యాలను తీసూంటాడు. అన్యాయం చేసిన వ్యక్తి వద్ద సత్కార్యాలు లేకపోయినట్లైతే, అన్యాయానికి గురైన వ్యక్తి యొక్క చెడు పనులలో కొన్ని అన్యాయం చేసిన వ్యక్తిపై వేయబడతాయి.