ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు, వారి సమాజము కాలపరంగా చివరి సమాజము మరియు ప్రళయదినాన మొట్టమొదట లెక్క తీసుకోబడే సమాజము కూడా అదే. ప్రళయదినాన ఇలా పిలవబడుతుంది: 'నిరక్షరాస్య సమాజం మరియు దాని ప్రవక్త ఎక్కడ ఉన్నారు?'. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చదవడం, రాయడం తెలియని నిరక్షరాస్యులు కావడాన్ని బట్టి ఈ సమాజానికి ఆ పేరు వచ్చింది. కాబట్టి మనము మొదట లెక్క కోసం పిలవబడతాము. మనము ఈ ప్రపంచంలో చిట్టచివరి వాళ్ళము, కానీ తీర్పు రోజున లెక్కలో మరియు స్వర్గంలో ప్రవేశించడంలో మొదటివాళ్ళం.