నుమాన్ బిన్ బషీర్ రజియల్లాహు అన్హుమా ఇలా ఉల్లేఖించారు, తాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మింబర్ వద్ద కూర్చొని ఉండగా, ఒక వ్యక్తి ఇలా అనడం విన్నారు: "ఇస్లాం స్వీకరించిన తర్వాత, నేను హాజీలకు నీరు అందించడం తప్ప మరే ఇతర ఆచరణ చేయకపోయినా నాకు పర్వాలేదు. మరొకరు అన్నారు: నేను ఇస్లాం స్వీకరించిన తర్వాత, మస్జిద్ అల్-హరామ్ కు సేవ చేయటం తప్ప మరే ఇతర పని చేయకపోయినా నాకు ఫర్వాలేదు. ఇంకొకరు అన్నారు: అల్లాహ్ మార్గంలో చేసే జిహాద్ మీరిద్దరూ చెప్పిన దాని కంటే శ్రేష్ఠమైనది. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మింబర్ వద్ద బిగ్గరగా మాట్లాడకుండా వారిని గద్దించారు, అది జుమహ్ రోజు ఉదయం, అయితే జుమహ్ నమాజు చదివిన తర్వాత ఆయన వద్దకు వెళ్లి మీరు విభేదించుకున్న విషయం గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి తీర్పు కోరతాను, అప్పుడు అల్లాహ్ అజ్జ వ జల్ ఈ ఆయతును అవతరింపజేశాడు: ఏమీ? హజ్జ్ మరియు ఉమ్రా కొరకు వచ్చే వారికి నీరు త్రాగించటాన్ని మరియు మస్జిద్ అల్ హరామ్ ను నిర్వహించటాన్ని, మీరు అల్లాహ్ ను మరియు అంతిమదినాన్ని విశ్వసించి, అల్లాహ్ మార్గంలో పోరాడేదానికి సమానంగా భావిస్తున్నారా? అల్లాహ్ దగ్గర, వారు (ఈ రెండు పక్షాల వారు) సరిసమానులు కారు. మరియు అల్లాహ్ దుర్మార్గులైన ప్రజలకు సన్మార్గం చూపడు. [అత్తౌబా 9:19]