జిబ్రయీల్ అలైహిస్సలాం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కూర్చుని ఉన్నపుడు ఆయన స్వర్గము నుండి ఏదో తలుపు తెరువబడున్న శబ్దం విన్నారు. ఆ శబ్దం విని జిబ్రయీల్ అలైహిస్సలాం తన తలను పైకి ఎత్తి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఇలా తెలిపినారు – అది స్వర్గములోని ఒక ద్వారము, అది ఈ రోజు తెరువబడినది, ఇంతకు మునుపు ఎప్పుడూ తెరువబడలేదు. ఆ ద్వారము నుండి ఒక దైవదూత భూమి మీదకు దిగివచ్చినాడు. అతడు అంతకు మునుపు ఎన్నడూ భూమి మీదకు దిగిరాలేదు. ఆ దైవదూత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు సలాం చేసి ఇలా పలికినాడు: “నేను మీకు అందజేసిన మరియు మీ కంటే ముందు ఏ ప్రవక్తకూ ఇవ్వబడని రెండు వెలుగుకిరణాల శుభవార్త పట్ల సంతోషించండి. అవి సూరతుల్ ఫాతిహా మరియు సూరతుల్ బఖరహ్ యొక్క చివరి రెండు ఆయతులు.” అప్పుడు ఆ దైవదూత ఇలా అన్నాడు: ఎవరైనా ఆ రెండింటిలో నుండి ఒక్క అక్షరం పఠించినా, సర్వోన్నతుడైన అల్లాహ్ అతనికి వాటిల్లో ఉన్న మంచిని, దుఆలను, వేడుకోళ్ళను అతనికి ప్రసాదిస్తాడే తప్ప, అలా ప్రసాదించకుండా ఉండడు.