ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపినారు: పరలోక జీవితం తప్ప నిజమైన జీవితం మరొకటి లేదు, అల్లాహ్ యొక్క ప్రసన్నత, కరుణ మరియు స్వర్గం తప్ప మరొకటి లేదు, ఎందుకంటే ఇహలోక జీవితం క్షణికమైనది, మరి పరలోక జీవితం నిత్యమైనది మరియు శాశ్వతమైనది. ఆ తరువాత, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు మరియు ముహాజిర్లకు ఆశ్రయం ఇచ్చిన అన్సార్ల కోసం వారి క్షమాపణ, గౌరవం మరియు ధర్మం కోసం దుఆ చేసారు. మక్కా నుండి మదీనాకు వలస వచ్చిన ముహాజిర్లకు అన్సారులు మద్దతుగా నిలిచారు, తమ సంపదను వారితో పంచుకున్నారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, తమ ఇళ్ళను, తమ సంపదలను వదిలి కేవలం అల్లాహ్ యొక్క ప్రసన్నత కొరకు మరియు ఆయన ప్రసాదించే ప్రతిఫలం కొరకు వలస వచ్చిన ముహాజిర్ల కొరకు కూడా దుఆ చేసినారు.