ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపినారు - ఒకవేళ ప్రజలు అదాన్ (నమాజ్కు పిలుపు) మరియు మొదటి వరుసలో (నమాజులో) నిలబడడంలో ఉన్న గొప్ప పుణ్యం, ఫలితాన్ని నిజంగా తెలుసుకుంటే, దానిని పొందేందుకు ఎవరు ముందుగా హక్కు పొందాలో నిర్ణయించేందుకు లాటరీ వేసుకోవాల్సి వచ్చినా వారు అలా చేసేవారు. అలాగే, నమాజ్ను ప్రారంభ సమయంలోనే మస్జిద్కు రావడంలో ఉన్న ప్రతిఫలం తెలుసుకుంటే, అందరూ ముందుగా రావడానికి పోటీ పడేవారు. ఇంకా, ఇషా (రాత్రి) మరియు ఫజర్ (ఉదయం) నమాజుల్లో ఉన్న ప్రతిఫలం, పుణ్యం ఎంత గొప్పదో తెలుసుకుంటే, వారు నడవలేకపోయినా, చేతుల మీద నడుస్తూ అయినా ఆ నమాజులకు తప్పకుండా హాజరవుతారు.