ము’అదహ్ అల్ అదవియ్యహ్ అనే స్త్రీ విశ్వాసుల మాతృమూర్తి అయిన ఆయిషా రదియల్లాహు అన్హాను ఇలా ప్రశ్నించినారు: “ఋతుస్రావంలో ఉన్న స్త్రీ తాను ఉండలేక పోయిన ఉపవాసాలను తరువాత పూర్తి చేస్తుంది, కానీ ఆ స్థితిలో చేయలేక పోయిన నమాజులను ఆ తరువాత పూర్తి చేయదు, ఎందుకు?” ఆయిషా రదియల్లాహు అన్హా ఆమెను “నీవు ఖారిజీయులలో ఒకరైన హరూరియ్యహ్’లలో ఒకరివా? వాళ్ళు మొండిగా, కఠినంగా ఉండేవారు, తరుచుగా ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉండేవారు” అని ప్రశ్నించినారు. ఆ స్త్రీ “లేదు, నేను ఖారిజీయురాలిని కాను, ఆసక్తి కొద్దీ ప్రశ్నించినాను” అని బదులిచ్చింది. అప్పుడు ఆయిషా రదియల్లాహు అన్హా ఇలా అన్నారు: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలములో మాకు ఋతుస్రావం సంభవించినప్పుడు మేము ఉండలేకపోయిన ఉపవాసాలను పూర్తి చేయమని ఆదేశించబడేవారము, కానీ నమాజుల విషయములో అలా ఆదేశించబడలేదు.”