ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ కూతురు జైనబ్ రదియల్లాహు అన్హా మరణించారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లమ్ ఆమెకు గుసుల్ చేయించే స్త్రీల వద్దకు వచ్చి ఇలా చెప్పారు: "ఆమెకు నీటితో’ రేగుఆకులతో బేసి సంఖ్యలో మూడు సార్లు, లేదా ఐదు సార్లు, లేదా అవసరమైతే అంతకంటే ఎక్కువ సార్లు గుసుల్ చేయించండి. చివరి గుసుల్ లో కొంచం కాఫూర్ ను ఉపయోగించండి. మీరు ముగించిన తరువాత నాకు తెలియజేయండి. ఆమెకు గుసుల్ చేయించడం పూర్తి చేసిన తర్వాత, వారు ఆయనకు తెలుపగా, ఆయన గుసుల్ చేయించిన మహిళలకు తన ఇజార్ ను ఇచ్చి, ఇలా అన్నారు: ‘ఆమెను దీనిలో చుట్టండి, దీనినే ఆమె శరీరానికి తగిలి ఉండే వస్త్రంగా చేయండి’. ఆ తర్వాత, ఆమె జుట్టును మూడు జడలుగా అల్లారు.