ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ప్రవక్త పదవి ప్రారంభంలో వహీ (దైవవాణి) అవతరించడం ఆగిపోవడం గురించి వివరిస్తూ ఇలా తెలిపారు: నేను మక్కా వీధులలో నడుస్తుండగా, అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక శబ్దం విన్నాను. నేను నా దృష్టిని పైకి ఎత్తి చూశాను, అక్కడ హీరా గుహలో నా వద్దకు వచ్చిన దైవదూత జిబ్రయీల్, ఆకాశం మరియు భూమి మధ్య ఒక కుర్చీపై కూర్చుని ఉన్నారు. ఆయనను చూసి నేను భయభ్రాంతులకు గురయ్యాను, వెంటనే నా ఇంటివారి వద్దకు తిరిగి వెళ్లి, "నన్ను దుప్పటితో కప్పండి" అని అన్నాను. అప్పుడు అల్లాహ్ ఈ ఆయతులు అవతరింపజేశాడు: {ఓ దుప్పటిలో చుట్టుకున్నవాడా!} అంటే తన వస్త్రంలో చుట్టుకున్నవాడా, {లే!} ప్రబోధన కొరకు. {ఇక హెచ్చరించు} నీ సందేశాన్ని విశ్వసించని వారిని. {మరియు మీ ప్రభువు} మరియు మీ ఆరాధ్య దైవాన్ని {గొప్పతనాన్ని (ఘనతను) కొనియాడు (చాటి చెప్పు)} మరియు ఆయనను ప్రశంసించు మరియు ఆయన ఘనత ప్రకటించు. {وَثِيَابَكَ} అనగా నీ వస్త్రాలను {فَطَهِّرْ} మాలిన్యాల నుండి పరిశుభ్రంగా ఉంచుకో, {وَالرُّجْزَ} అనగా విగ్రహాలు మరియు ప్రతిమల ఆరాధనను {فَاهْجُرْ} వదిలివేయి, ఆ తర్వాత కాలంలో దైవవాణి (వహీ) బలపడి, అధికమైంది (తరచుగా అవతరించడం మొదలైంది).