పరాభవం, అవమానం, నష్టానికి గురయ్యే మూడు రకాల వ్యక్తులకు వ్యతిరేకంగా వారి ముక్కు మట్టి కొట్టుకు పోవాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ చేసినారు (అంటే అవమానించబడుగాక). మొదటి రకం వ్యక్తి: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పేరు తన సమక్షంలో ప్రస్తావించబడినప్పుడు, అతడు ఆయనపై దరూద్ పంపని వాడు అంటే కనీసం సల్లల్లాహు అలైహి వసల్లం అని అయినా పలకని వాడు. రెండవ రకం వ్యక్తి: రమదాన్ నెలను పొంది, ఆపై అల్లాహ్ ఆజ్ఞల ప్రకారం రమదాన్ మాసంలోని ప్రత్యేక ఆరాధనలలో పాల్గొనడం ద్వారా అల్లాహ్ యొక్క క్షమాపణ పొందే అవకాశం ఉన్నా, దాని సద్వినియోగం చేసుకోకుండానే ఆ నెలను పోగొట్టుకున్న వ్యక్తి. మూడవ రకం వ్యక్తి: తన తల్లిదండ్రులు వృద్ధాప్యాన్ని చేరుకున్నప్పటికీ, అతను వారి హక్కులను సరిగ్గా పూర్తి చేయకుండా, వారికి అవిధేయత చూపినందున మరియు వారిని ఉపేక్షించినందున, వారు స్వర్గంలో ప్రవేశింపజేయలేకపోయిన వ్యక్తి.