ప్రవక్త ముహమ్మద్ ﷺ వ్యాపార లావాదేవీలలో ప్రమాణాలు చేయడాన్ని మరియు వాటిని మరీ తరచుగా చేయడాన్ని గురించి హెచ్చరించారు — ఎలాంటి ఒత్తిడి లేకుండా, నిజాయితీపరంగా ఆ వ్యాపార లావాదేవీ జరుగుతున్నా సరే. ఎందుకంటే అవి వస్తువు అమ్మకానికి సహాయపడవచ్చు, కానీ ఆ లాభంలోని శుభాలను హరించి వేస్తుంది, సంపద నశించడం మొదలవుతుంది. ప్రవక్త ﷺ హెచ్చరిక: దాని వలన మహోన్నతుడైన అల్లాహ్ మానవుడి ధనాన్ని ఇలాంటి కొన్ని మార్గాల్లో నశింపజేస్తాడు — ఉదాహరణకు: దొంగతనం, అగ్నిప్రమాదం, నీళ్ళలో మునిగి పోవడం, బలవంతంగా లాక్కోబడటం, దోపిడి, లేదా ఇతర అనూహ్యమైన ఆపత్తులు (అపాయాలు, దుర్ఘటనలు). ఇవన్నీ అల్లాహ్ యొక్క అనుగ్రహాలు కోల్పోయినప్పుడు కలిగే ఫలితాలు.