హిషాం బిన్ హాకిం బిన్ హిజాం రదియల్లాహు అన్హుమా సిరియాలో ఉండగా, ఒకసారి మండుతున్న ఎండలో నిలబడి ఉన్న కొంతమందిని దాటుకుంటూ వెళ్ళినారు. వారిని గురించి ఆయన వాకబు చేసినారు. వారు చెల్లించగలిగిన స్థితిలో ఉన్నప్పటికీ, జిజియా పన్ను చెల్లించనందుకు వారు ఆ మండుతున్న ఎండలో నిలబెట్టబడినారు అని ఆయనకు తెలియజేయడం జరిగింది. అది విని హిషామ్ రదియల్లాహు అన్హు ఇలా అన్నారు: “”నేను సాక్ష్యమిస్తున్నాను, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “నిశ్చయంగా, ఈ లోకంలో ప్రజలను అన్యాయంగా, ఎటువంటి హక్కు లేకుండా హింసించేవారిని అల్లాహ్ శిక్షిస్తాడు.”