ఆహారం భుజించిన తరువాత ప్రతి ఒక్కరూ అల్లాహ్ యొక్క ఘనతను కొనియాడాలని (ఆయన ఘనత ముందు మన అశక్తతను గుర్తించాలని) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హితబోధ చేస్తున్నారు. ‘అల్లాహ్ సర్వ శక్తిమంతుడు, ఆయన సహాయంతో తప్ప, ఆహారం తెచ్చుకొనుటకు గానీ, దానిని భుజించుటకు గానీ శక్తిలేని వాడను’ అని. ఆహారం భుజించిన తరువాత ఎవరైతే ఆ విధంగా అల్లాహ్ యొక్క ఘనతను కొనియాడుతారో, అతని పూర్వపు చిన్న చిన్న పాపాలన్నీ క్షమించబడుటకు అర్హుడవుతాడు అనే శుభవార్తను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందజేస్తున్నారు.