ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహాబాలను ఇలా ప్రశ్నించారు: నఫిల్ ఉపవాసాలు, నమాజులు మరియు దానధర్మాలను అధికంగా ఆచరించడం కంటే ఎక్కువ పుణ్యప్రదమైన దాని గురించి మీకు తెలియజేయనా? వారు, ‘తప్పకుండా’ అని అన్నారు. అప్పు ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: వివాదంలో ఉన్న వారి మధ్య సయోధ్య (అవసరం), ఎందుకంటే వివాదం ప్రజల మధ్య విభజన, అపరిచిత్వం, పరస్పర ద్వేషం మరియు పరస్పర విముఖతను కలిగిస్తుంది. నిశ్చయంగా, పరస్పర సంబంధాలు చెడిపోవడం వల్ల కలిగే ద్వేషం ఒకలాంటి గుణం, అది కత్తి వెంట్రుకలను ఎలాగైతే సమూలంగా కత్తిరించి వేస్తుందో, అదే విధంగా ధర్మాన్ని మరియు ప్రాపంచిక జీవితాన్ని నాశనం చేసి సమూలంగా పెరికివేస్తుంది.