మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు: (అల్లాహ్ పలుకులు) "పునరుత్థాన దినమున నేను మూడు రకాల వ్యక్తులకు విరోధిగా ఉంటాను మరియు నేను ఎవరికైతే విరోధిగా ఉంటానో, అతనిని ఓడించివేస్తాను": మొదటిది: ఎవరైతే అల్లాహ్ పై ప్రమాణం చేసి, ఒడంబడిక చేసుకుని, ఆ తర్వాత దానిని ఉల్లంఘించి ద్రోహం చేస్తాడో. రెండవవాడు: ఒక స్వతంత్రుడైన వ్యక్తిని బానిసగా అమ్మి, ఆ సొమ్మును తిని, దాని విలువను వాడుకున్నవాడు. మూడవది: ఒక మనిషిని కూలికి పెట్టుకుని, అతనితో పూర్తిగా పని చేయించుకుని, అతనికి కూలి ఇవ్వనివాడు.