అలీ బిన్ అబూతాలిబ్ రదియల్లాహు అన్హు తన ధార్మిక విచక్షణతో, ఇస్లాం నుండి ధర్మభ్రష్టులైన కొంతమంది పాషండులను అగ్నితో కాల్చేశారు. ఈ విషయం అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హుమాకు చేరగా, ఆయన వారిని హతమార్చిన చర్యను సమర్థించారు; అయితే వారిని అగ్నితో కాల్చడాన్ని వ్యతిరేకించారు. ఆయన ఇలా అన్నారు: ఒకవేళ నేను అతని స్థానంలో ఉంటే వారిని అగ్నితో కాల్చేవాడిని కాదు; ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా స్పష్టం చేశారు - అగ్నితో శిక్షించడం అగ్నికి ప్రభువైన అల్లాహ్ కు మాత్రమే శోభిస్తుంది. అయితే, వారిని కేవలం హతమార్చడమే సరిపోతుంది, ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు: ‘ఎవరైతే ఇస్లాం నుండి ధర్మభ్రష్టుడై తన ధర్మాన్ని వేరొక ధర్మానికి మార్చుకుంటాడో, అతడికి మీరు మరణశిక్ష విధించండి’.