ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు: ఎవరైతే ఏకదైవారాధకుడిగా (తౌహీద్ పై) ఉంటూ, అల్లాహ్ కు దేనినీ సాటి కల్పించని స్థితిలో మరణించి ఆయనను కలుస్తాడో, అతను తన పాపాల కారణంగా నరకంలో శిక్షించబడినప్పటికీ, చివరికి అతని గమ్యస్థానం స్వర్గమే అవుతుంది. మరియు ఎవరైతే అల్లాహ్ కు ఇతరులను సాటి కల్పిస్తూ (షిర్క్ చేస్తూ) మరణిస్తాడో, షిర్క్ తో పాటు చేసిన ఏ పుణ్యకార్యం కూడా అతనికి ప్రయోజనం చేకూర్చదు; మరియు అతనిపై స్వర్గం నిషిద్ధం (హరామ్) చేయబడుతుంది.