అల్లాహ్ స్మరణ (జిక్ర్) ను నిర్లక్ష్యం చేయకూడదని ప్రవక్త ﷺ హెచ్చరించారు. ఎవరైనా ఒక సమూహంగా సభలో కూర్చుని, ఆ సభలో అల్లాహ్ను స్మరించకపోతే మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై దురూద్ పంపకపోతే — ఆ సభ (సమావేశం) ప్రళయదినం నాడు వారి కొరకు బాధగా, పశ్చాత్తాపంగా, నష్టంగా, లోటుగా మారుతుంది. అల్లాహ్ కు ఇష్టమైతే, వారి గత పాపాల వల్ల, వారు చేసిన తప్పుల వల్ల వారిని శిక్షించవచ్చు. లేదా ఆయన తన అనుగ్రహం, దయ, కరుణల వలన వారిని క్షమించవచ్చు.