ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ సామీప్యం పొందడానికి తన మస్జిదు లోపల ఒక గుడారంలో ఏతికాఫ్’లో ఉన్నారు, అప్పుడు ఆయన తన సహాబాలు ఒకరికొకరు ఇబ్బంది కలిగించేలా చాలా బిగ్గరగా ఖుర్ఆన్ పఠించడం విన్నారు. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గుడారం పైనున్న తెరను తొలగించి, అలా చేసిన వారిని మందలించి, ఇలా అన్నారు: "మీరందరూ ఖుర్ఆన్ పఠనం ద్వారా మీ ప్రభువుతో సంభాషిస్తున్నారు, కాబట్టి మీరు ఒకరికొకరు ఇబ్బంది కలిగించుకోకండి, మరియు పఠనంలో లేదా నమాజులో ఒకరిపై ఒకరు మీ స్వరాన్ని పెంచకండి."