ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేసినారు: “ప్రజలు ఏదైనా ఒక సమావేశములో పాల్గొని ఉండి, అందులో అల్లాహ్ యొక్క ప్రస్తావన లేకుండానే వెళ్ళిపోయినట్లయితే, అది దుర్గంధం మరియు ధూళితో కలిసి ఉన్న ఒక గాడిద మృతదేహం చుట్టూ కూర్చుని లేచి వెళ్ళిన దానితో సమానం. ఎందుకంటే, వారు అల్లాహ్ పేరును ప్రస్తావించకుండా మిగతా విషయాలు మాట్లాడడంలో మునిగిపోయారు. తీర్పుదినము నాడు అటువంటి సమావేశము వారి కొరకు దుఃఖ కారణం అవుతుంది, మరియు నిరంతర విచారానికి కారణం అవుతుంది.