ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మింబర్ (Minbar)పై ఉపన్యాసం ఇస్తుండగా ఒక వ్యక్తి ఆయనను అడిగాడు: 'ఓ రసూలుల్లాహ్! నేను రాత్రి నమాజ్ (ఖియాముల్ లైల్) ఎలా చేయాలో నాకు నేర్పండి? అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: ప్రతి రెండు రకాతుల తరువాత సలాం చేయాలి, తెల్లవారుతుందన్న భయం కలిగితే ఒక రకాత్ చదువు, అది నీవు చదివిన నమాజులను బేసి సంఖ్యగా మార్చేస్తుంది, మరియు నిశ్చయంగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రి యొక్క చివరి నమాజును వితర్ గా చేయమని ఉపదేశించేవారు.