అనస్ ఇబ్న్ మాలిక్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ప్రజలు మస్జిదుల గురించి పోటీ పడి గొప్పలు చెప్పుకోనంత వరకు ప్రళయ ఘడియ రాదు.” ప్రామాణికమైన హదీథు - అబూ దావూద్, అన్నసాయీ మరియు ఇబ్న్ మాజహ్ నమోదు చేసినారు:
explain-icon

వివరణ

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: పునరుత్థాన దినం చేరువకావడం మరియు ప్రపంచము ఒక ముగింపుకు రావడం యొక్క సంకేతాలలో - ప్రజలు తమ మస్జిదుల అలంకరణ గురించి గొప్పలు చెప్పుకోవడం లేదా కేవలం అల్లాహ్’ను స్మరించుట కొరకు మాత్రమే నిర్మించిన మస్జుదుల లోపల వారి ప్రాపంచిక వ్యవహారాల గురించి గొప్పలు చెప్పుకోవడం ఒకటి.

explain-icon

fawaed

  • మస్జిదుల గురించి గొప్పలు చెప్పుకోవడం నిషేధించబడింది మరియు ఇది ఆమోదయోగ్యం కాని చర్య, ఎందుకంటే అది అల్లాహ్ కొరకు చేయబడిన ఆచరణ కాదు.
  • మస్జిదులకు రంగులు వేయడం, వన్నెలను అద్దకం చేయడం, నగిషీలు చెక్కడం మరియు రాతలతో అలంకరించడం నిషేధించబడింది, ఎందుకంటే అవి ఆరాధకులు వాటిని చూసినప్పుడు వారి దృష్టి ఆరాధన నుండి మరలి పోయేలా చెస్తాయి.
  • అల్-సిందీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఈ హదీథ్, సత్యాన్ని ప్రస్తుత వాస్తవికత ద్వారా ధృవీకరించిన వాటిలో ఒకటి, మరియు ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం యొక్క స్పష్టమైన అద్భుతాలలో ఒకటి.