మక్కా నుండి మదీనాకు వలస వెళుతున్న (హిజ్రత్ చేస్తున్న) సందర్భములో అమీరుల్ ము’మినీన్ అబూ బక్ర్ అస్ సిద్దీఖ్ రదియల్లాహు అన్హు ఇలా అన్నారు: మేము థూర్ గుహలో (దాక్కుని) ఉన్నప్పుడు, బహుదైవారాధకులు గుహ పైభాగాన మా తలలకు సమీపంలో నిలబడి ఉండగా నేను వారి పాదాలను చూశాను. అపుడు నేను ఇలా అన్నాను, "ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! వారిలో ఎవరైనా తన పాదాల వైపు చూస్తే, అతను మనలను తన పాదాల దగ్గర చూడగలడు." దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, “ఓ అబూ బక్ర్! ఆ ఇద్దరి గురించి నీ అభిప్రాయం ఏమిటి, ఎవరితోనైతే అల్లాహ్ వారితో పాటు మూడవ వానిగా ఉండి వారికి విజయం, సహాయం, రక్షణ మరియు మార్గదర్శకత్వం అందిస్తూ ఉన్నట్లయితే.”