ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మెంబరుపై (ప్రసంగ వేదికపై) నిలబడి శుక్రవారం ప్రార్థనను నిర్లక్ష్యం చేయరాదని, సరియైన కారణం లేకుండా సోమరితనం లేదా అజాగ్రత్త కారణంగా శుక్రవారం నమాజును తప్పిపోకూడదని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హెచ్చరించారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా ఇలా అన్నారు ‘సత్యాన్ని అనుసరించకుండా నిరోధించే ఒక అడ్డంకితో అల్లాహ్ వారి హృదయాలను కప్పివేసి, వాటిని సీలు చేస్తాడు. ఫలితంగా, వారు మంచితనం యొక్క మార్గాలను పట్టించుకోని, లక్ష్యములేని వారిలో ఒకరిగా మిగిలిపోతారు. వారి ఆత్మలు విధేయత ఆచరణల నుండి తప్పుకుంటాయి.