ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన: ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటి వారు ఒక రోజులో రెండు పూటల భోజనం చేస్తే, అందులో ఒకటి కేవలం ఖర్జూరాలు మాత్రమే ఉండేవి. ప్రామాణికమైన హదీథు - అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
explain-icon

వివరణ

విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రదియల్లాహు అన్హా ఇలా నివేదించినారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కుటుంబ సభ్యులు ఒక రోజులో రెండు పూటల భోజనం తినలేదు, ఒకవేళ తింటే, అందులో ఒక పూట ఖర్జూరం మాత్రమే ఉండేది.

explain-icon

fawaed

  • ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన ఇంటివారి యొక్క అణుకువను ఇది సూచిస్తుంది, కొన్నిసార్లు వారికి రోజంతా ఒక్క పూట భోజనం మాత్రమే లభించేది.
  • వారికి ఇతర వస్తువుల కంటే ఖర్జూరం సులభంగా లభించేది.
  • ప్రవక్తల గుణగణాలలో మరియు ప్రవక్తల నాయకుని జీవన విధానంలో ఒకటైన వైరాగ్యం మరియు కొద్దిపాటి ఉపాధితో సంతృప్తి చెందడం యొక్క గొప్పతనం తెలుస్తున్నది.
  • ఒక రోజులో రెండుసార్లు భోజనం చేయడం అనేది అనుమతించబడిన మరియు ధర్మసమ్మతమైన విషయం. ఇది అరబ్బుల యొక్క ప్రసిద్ధ ఆచారాలలో ఒకటి, వారు రోజుకు రెండు భోజనాలు చేసేవారు: మధ్యాహ్న భోజనం మరియు రాత్రి భోజనం.
explain-icon

ఇంకా