ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేసినారు: పునరుత్థాన దినమున నరకములో అతి తక్కువ శిక్షను పొందే వ్యక్తికి అగ్నితో చేసిన రెండు పాదరక్షలు, మరియు (వాటిని కట్టి ఉంచే) రెండు పట్టీలు తొడగబడతాయి. వాటి వేడి కారణంగా అతని మెదడు రాగి కుండలో ఉడకబెట్టిన పదార్థం తుకతుక ఉడికినట్టుగా మరుగుతుంది. తన కంటే ఘోరంగా శిక్షించబడుతున్న వారెవ్వరూ అతనికి కనబడరు (తనకంటే ఘోరంగా శిక్షించబడుతున్న వారెవ్వరూ లేరు అని అతడు తలపోస్తాడు), వాస్తవానికి అందరికంటే తక్కువగా శిక్షించబడున్న వ్యక్తి అతడే అయినప్పటికీ. ఇది అతనికి శారీరకంగా శిక్షించడంతో పాటు అతన్ని మానసికంగా శిక్షకు గురిచేస్తుంది.