అనస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కిస్రాకు, కైసర్‌కు, నజాషీకి మరియు ప్రతి శక్తివంతమైన పాలకుడికి లేఖలు వ్రాశారు, అందులో వారిని మహోన్నతుడైన అల్లాహ్ వైపు పిలుపునిచ్చారు, మరియు అతను ఆ నజాషీ కాదు, ఎవరి కోసమైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం (జనాజా) నమాజు చేశారో. ప్రామాణికమైన హదీథు - ముస్లిం నమోదు చేసినారు:
explain-icon

వివరణ

అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన మరణానికి ముందు తన చుట్టూ ఉన్న రాజ్యాల రాజులను ఇస్లాం వైపుకు ఆహ్వానిస్తూ వారికి లేఖలు రాశారు; ఆయన కిస్రాకు (పర్షియాను పాలించిన ప్రతి ఒక్కరి బిరుదు), కైసర్‌కు (రోమ్‌ను పాలించిన ప్రతి ఒక్కరి బిరుదు) మరియు నజాషీకి (హబషా రాజుల బిరుదు) లేఖలు రాశారు. మరియు ఆయన ప్రజలపై అధికారం చెలాయించే, వారిని అణచివేసే ప్రతి నిరంకుశ రాజుకు కూడా (లేఖలు) వ్రాశారు. అనస్ రదియల్లాహు అన్హు ఇలా స్పష్టం చేశారు: ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం లేఖ రాసిన ఆ నజాషీ, ఇస్లాం స్వీకరించి, మరణించి, ప్రవక్త ద్వారా సలాతుల్ గాయిబ్ (పరోక్షంగా జనాజా నమాజు) చేయబడిన నజాషీ కాదు.

explain-icon

fawaed

  • రాజులు మరియు అధిపతులతో సహా ముస్లిమేతరులను ఇస్లాం వైపుకు ఆహ్వానించడం షరీఅతు బద్దమైన విషయం.
  • గ్రంథాలు మరియు లేఖల ప్రకారం ఆచరించడం ధర్మబద్దంగా చేయబడింది.
explain-icon

కూర్పులు

explain-icon

ఇంకా