అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన మరణానికి ముందు తన చుట్టూ ఉన్న రాజ్యాల రాజులను ఇస్లాం వైపుకు ఆహ్వానిస్తూ వారికి లేఖలు రాశారు; ఆయన కిస్రాకు (పర్షియాను పాలించిన ప్రతి ఒక్కరి బిరుదు), కైసర్కు (రోమ్ను పాలించిన ప్రతి ఒక్కరి బిరుదు) మరియు నజాషీకి (హబషా రాజుల బిరుదు) లేఖలు రాశారు. మరియు ఆయన ప్రజలపై అధికారం చెలాయించే, వారిని అణచివేసే ప్రతి నిరంకుశ రాజుకు కూడా (లేఖలు) వ్రాశారు. అనస్ రదియల్లాహు అన్హు ఇలా స్పష్టం చేశారు: ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం లేఖ రాసిన ఆ నజాషీ, ఇస్లాం స్వీకరించి, మరణించి, ప్రవక్త ద్వారా సలాతుల్ గాయిబ్ (పరోక్షంగా జనాజా నమాజు) చేయబడిన నజాషీ కాదు.